Monday, June 10, 2019

6 convicted in gang rape, murder of 8-yr-old girl in Kathua; 1 acquitted


ఎనిమిదేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం హత్య

కథువా కేసులో ముగ్గురికి యావజ్జీవ శిక్ష

ఎనిమిదేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం దారుణ హత్య కేసులో నిందితులు ముగ్గురికి యావజ్జీవ శిక్ష, మరో ముగ్గురికి అయిదేళ్ల కఠిన కారాగారం విధిస్తూ సోమవారం (జూన్10) పఠాన్ (పంజాబ్) కోర్టు తీర్పిచ్చింది. పఠాన్ కోట్ జడ్డి తేజ్విందర్ సింగ్ ఒకర్ని ఈ కేసు లో నిర్దోషిగా విడిచిపెట్టారు. బాలుడు ప్రధాన ముద్దాయి సాంజిరామ్ కొడుకుపై జమ్ము హైకోర్టులో విచారణ కొనసాగునున్నట్లు తీర్పులో పేర్కొన్నారు.  గత ఏడాది జనవరి 10న దక్షిణ కశ్మీర్ లోని కథువా జిల్లాలో గుర్రాలను మేపడానికి నిర్జన ప్రదేశానికి వెళ్లిన బాలికను అపహరించుకుపోయిన దుండగులు వారంరోజుల పాటు ఓ గుడిలో ఉంచి మాదకద్రవ్యాలు (డ్రగ్స్) ఇస్తూ దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత బాలిక తలను బండకేసి కొట్టి హత్యచేశారు. ఈ దారుణం జనవరి 10న జరగ్గా 17వ తేదీన బాలిక శవాన్ని కనుగొన్నారు. కథువా జిల్లాలోని హీరానగర్ తహశిల్ లోని రాసనా గ్రామంలో జరిగిన ఈ అమానవీయ ఘోర ఘటనలో ప్రధాన ముద్దాయి సాంజి రామ్ తో పాటు మొత్తం ఎనిమిది మందిపై ఏప్రిల్ లో పోలీసులు చార్జీషీట్ దాఖలు చేశారు. బాలికపై జరిగిన ఈ ఘోర కలిపై కశ్మీర్ సహా యావద్దేశం అట్టుడుకిపోయింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరుల్లో నిరసనలు మిన్నంటాయి. ఘటన తీవ్రత దృష్ట్యా స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు నుంచి కేసును పొరుగునున్న పఠాన్ కోట్ కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు 7 మే 2018న ఆదేశాలిచ్చింది. అంతేకాకుండా కోర్టు విచారణను ఏ రోజుకారోజు సుప్రీం పర్యవేక్షించింది.  గ్రామంలో జరిగిన స్వల్ప స్థల వివాదాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధాన నిందితుడు సాంజిరామ్ మైనార్టీ గిరిజన ముస్లిముల్ని (నొమడిక్ వర్గాన్ని) తమ ప్రాంతం నుంచి వెళ్లగొట్టే ఉద్దేశంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. సాంజిరామ్, అతని కొడుకు సహా మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వీరందరి పైన విచారణ జరిపిన న్యాయస్థానం ఆ ఘోరం జరిగిన సమయంలో సాంజిరామ్ కొడుకు విశాల్ జల్గోత్రా మీరట్ లో ఉన్నట్లు కోర్టుకు ఆధారాలు సమర్పించడంతో న్యాయమూర్తి సంశయ లాభం (బెనిఫిట్ ఆఫ్ డౌట్) కింద అతణ్ని నిర్దోషిగా విడిచిపెట్టారు. ప్రధాన నిందితుడు సాంజిరామ్, దీపక్ ఖజురియా, పర్వేశ్ కుమార్ లకు  రణబీర్ పీనల్ కోడ్ (ఆర్పీసీ) నేర శిక్షాస్మృతి మైనర్ అపహరణ, దారుణం శారీరక హింస, అత్యాచారం, పాశవిక హత్యా నేరాల కింద యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. సాక్ష్యాలను తారుమారు చేయడం, నాశనం చేయడం వంటి నేరానికి పాల్పడిన ప్రత్యేక పోలీసు అధికారి సురేందర్ జోషి, ఆనంద్ దిత్తా, హెడ్ కానిస్టేబుల్ తిలక్ రాజ్ ముగ్గురుకి అయిదేళ్ల కఠిన కారాగారం రూ.50 వేల జరిమానా విధించారు.

1 comment: