Sunday, May 12, 2019

37 bangladeshi migrants drowned in tunisia coast



తునిసియా తీరంలో 37 మంది బంగ్లాదేశ్ వలసదారుల మృతి
తునిసియా సమీపంలోని మధ్యధరా సముద్రంలో బోటు మునిగిపోయిన దుర్ఘటనలో 37 మంది బంగ్లాదేశ్ జాతీయులు మృత్యుపాలయ్యారు. శుక్రవారం బోటు మునిగిపోయినట్లు తెలుస్తోంది. ట్రిపోలీ లోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. అయితే బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ మంత్రి ఏకే అబ్దుల్ మొమెన్ మృతుల సంఖ్యను నిర్ధారించడం లేదు. తమ దేశీయులు 37 మంది జాడ తెలియడం లేదని మాత్రమే పేర్కొన్నారు. బోటు ప్రమాదానికి గురయ్యే సమయానికి మొత్తం 60 మంది అందులో ప్రయాణిస్తున్నారు. వారిలో 51 మంది బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వలసదారులే ఉన్నారు. అందులో 16 మందిని రక్షించినట్లు తెలుస్తోంది. ఇంకా జాడ తెలియని వారిలో ఈజిప్ట్, మొరాకో జాతీయులు ఉన్నారు. వీరంతా లిబియా(జౌరా) నుంచి యూరప్ కు బోటులో ప్రయాణిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. బోటు మునకకు కారణాలు తెలియాల్సి ఉంది. యూరప్ లో బతుకు తెరువు కోసం ప్రమాద మార్గంలో(అనుమతి లేని బోట్లు, పడవల్లో) ప్రయాణిస్తూ చాలా మంది సముద్ర జలాల్లో మునిగి చనిపోతున్నారు.

No comments:

Post a Comment