Wednesday, May 1, 2019

16 security personnel killed in ied blast in gadchiroli



మహారాష్ట్రలో బాంబు పేలుడు 16 మంది పోలీసుల దుర్మరణం
శక్తిమంతమైన బాంబు పేలుడు ఘటనలో 16 మంది పోలీసులు మృత్యువాత పడ్డారు. మహారాష్ట్రలోని గడ్చిరొలి జిల్లాలో బుధవారం (మే1) ఈ దారుణం జరిగింది. నాగ్ పూర్ కి 250 కిలోమీటర్ల దూరంలో ప్రత్యేక పోలీసు బలగాలు ప్రయాణిస్తున్న వాహనాల్ని తీవ్రవాదులు ఐ.ఇ.డి బాంబుతో పేల్చేశారు. ఆ ప్రాంతంలో మంగళవారం రోడ్డు నిర్మాణ కంపెనీకి చెందిన 25 వాహనాల్ని మావోలు తగులబెట్టారు. పరిస్థితిని సమీక్షించేందుకు ప్రత్యేక పోలీసు బలగాలు బయలుదేరాయి. కొర్చి కి రెండు వాహనాల్లో బయలుదేరిన పోలీసు బలగాలు దాదాపూర్ రోడ్డు కి చేరుకోగానే తీవ్రవాదులు మాటు వేసి బాంబును చాకచాక్యంగా పేల్చడంతో పెద్ద సంఖ్యలో పోలీసులు దుర్మరణం చెందినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. సి-60 ప్రత్యేక పోలీసు విభాగానికి చెందిన మొత్తం 25 మంది పోలీసులు రెండు వాహనాల్లో ప్రయాణిస్తున్నారన్నారు. పేలుడు ధాటికి రెండు వాహనాలు తునాతునకలయ్యాయి. వ్యూహాత్మకంగా మావోలు ఈ ఘాతుకానికి తెగబడినట్లు స్పష్టమౌతోంది. ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవస్ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డీజీపీతో పరిస్థితిని సమీక్షించామని రాష్ట్రంలో యావత్ పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామన్నారు. ప్రధాని మోదీ తీవ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండించారు. మృత వీరులకు వందనాలు తెల్పుతూ వారి త్యాగాల్ని ఎన్నటికి మరువమన్నారు. మృతుల కుటుంబాలకు సంఘీభావాన్ని తెల్పుతూ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment