Wednesday, April 15, 2020

Karnataka former CM Kumaraswamy to go ahead with his son marriage during covid-19 pandemic

కుమార.. నీకు అర్థమౌతోందా?!
యావత్ ప్రపంచం కరోనా మహమ్మారి సృష్టిస్తోన్న విలయంతో విలవిల్లాడిపోతుంటే.. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామికి అర్థమౌతోందా? అనే అనుమానం కల్గుతోంది. దేశంలో తాజాగా కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరుగుతుండగా అనుకున్న ముహూర్తానికే కొడుకు పెళ్లి చేసేయాలని కుమారస్వామి ఏర్పాట్లలో తలమునకలవుతున్నారు. తన కుమారుడు, మాజీ ప్రధాని దేవేగౌడ మనవడైన నిఖిల్ గౌడ, కాంగ్రెస్ నేత ఎం. క్రిష్ణప్ప మనవరాలు (మేనకోడలి కూతురు) రేవతి పెళ్లి అంగరంగ వైభవంగా నిర్వహించాలని తొలుత అనుకున్నారు. రామనగర జిల్లాలో 95 ఎకరాల స్థలంలో వివాహ వేదిక ప్రాంగణాన్ని నిర్మించి అయిదు లక్షల మంది పార్టీ కార్యకర్తలు, బంధుమిత్రులను ఆహ్వానించాలని ఆయన భావించారు. తర్వాత బెంగళూరులో గ్రాండ్ రిసెప్షనూ ఏర్పాటు చేయాలనుకున్నారు. నిశ్చితార్థానికి సీఎం యడ్యూరప్ప సహా పలువురు ప్రముఖులు కుమారస్వామి ఆహ్వానం మేరకు హాజరయ్యారు. కానీ లాక్‌డౌన్-2 అమలులో ఉన్న కారణంగా పెళ్లికి లక్షల మందిని ఆహ్వానించే పరిస్థితి లేదు. అయినా నిఖిల్, రేవతిల పెళ్లి యథాతథంగా ఏప్రిల్ 17న  జరగనుంది. ఆ రోజున మంచి ముహూర్తం ఉండడమే అందుకు కారణం. పైగా ముహూర్తాల పట్ల, దేవుడి మీద అపార నమ్మకం కల్గిన ఆయన ముందు నిర్ణయమైన తేదీలోనే ఎలాగైనా సరే పెళ్లి జరపాలని నిర్ణయించారు.  అయితే తన కొడుకు పెళ్లికి ఎవరూ రావొద్దని జేడీఎస్ కార్యకర్తలు, శ్రేయోభిలాషులను కుమారస్వామి కోరుతున్నారు. కరోనా తగ్గిసాధారణ పరిస్థితులు నెలకొన్నాకే  బ్రహ్మాండమైన రిసెప్షన్ ఏర్పాటు చేస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు. శుక్రవారం జరగనున్న పెళ్లికి 15 నుంచి 20 మంది కుటుంబ సభ్యులు మాత్రమే హాజరవుతారని కుమారస్వామి ప్రకటించారు.

Tuesday, April 14, 2020

AP DGP office will provide special passes to them who needs emergency services

ఏపీలో లాక్ డౌన్ స్పెషల్ పాస్ లు
దేశవ్యాప్తంగా లాక్డౌన్ పొడిగింపు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో పోలీసుశాఖ స్పెషల్ పాస్ లు జారీ చేయనుంది. మేరకు డీజీపీ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. మంగళవారం దేశ ప్రధాని నరేంద్రమోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ మే 3వరకు మరో 19 రోజులు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ప్రపంచంలో ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో లాక్ డౌన్ పకడ్బందీగా అమలువుతోంది. రోడ్లపై పోలీసులు చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు చేస్తున్నారు. అదే విధానం ఏపీలోనూ గడిచిన 21 రోజులుగా కొనసాగుతోంది. అయితే ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి మండలాన్ని యూనిట్ గా తీసుకుంటూ  రాష్ట్రంలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ మండలాలున్న సంగతిని ఇటీవల ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఆయన దృష్టికి తెచ్చారు. రాబోయే కాలంలో దశలవారీగా లాక్ డౌన్ నిబంధనల సడలింపును కోరారు. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతుండడంతో ప్రధాని లాక్ డౌన్ కొనసాగింపునకే మొగ్గు చూపారు. నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యేక పాసులు మంజూరు చేస్తామని ఏపీ డీజీపీ కార్యాలయం ప్రకటించింది. పాస్ మంజూరు కోసం 13 జిల్లాల పోలీస్ శాఖ వాట్సాప్ నెంబర్లు, మెయిల్ వివరాలను అందుబాటులో ఉంచారు. అత్యవసర పరిస్థితిలో పాస్ కావాల్సిన వారు ఆధార్ కార్డు, పూర్తి వివరాలతో పాటు తమ సమస్యలను ఆయా జిల్లా పోలీస్ అధికారులకు వివరిస్తే వెంటనే పాస్ మంజూరు చేస్తారని పోలీస్ శాఖ స్పష్టం చేసింది. పాస్లను దుర్వినియోగం చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
జిల్లాల వారీగా ఎస్పీ ఆఫీస్ ఫోన్ నంబర్లు
శ్రీకాకుళం-6309990933
విజయనగరం-9989207326
విశాఖపట్టణం(సిటీ)-9493336633
విశాఖపట్టణం(రూరల్)-9440904229
తూర్పుగోదావరి-9494933233
పశ్చిమగోదావరి-8332959175
కృష్ణా-9182990135
విజయవాడ(సిటీ)-7328909090
గుంటూరు(అర్బన్)-8688831568
గుంటూరు(రూరల్)-9440796184
ప్రకాశం-9121102109
నెల్లూరు-9440796383
చిత్తూరు-9440900005
తిరుపతి(అర్బన్)-9491074537
అనంతపురం-9989819191
కడప-9121100531
కర్నూలు-7777877722

Monday, April 13, 2020

CM KCR wears mask first time after state record first Covid case

తొలిసారి ముసుగులో కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ తొలిసారి మాస్క్ ధరించారు. కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ అమలు తదితరాలపై ఆయన సోమవారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మార్చి 1 హైదరాబాద్కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్కు కరోనా పాజిటివ్ వచ్చిన  నెలన్నర తర్వాత తొట్టతొలిసారి సీఎం కేసీఆర్ మాస్క్ ధరించారు. రాష్ట్రంలో ఇప్పటికే మాస్క్ ధరించడం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు సైతం జారీ చేసిన సంగతి తెలిసిందేసర్జికల్ మాస్క్ధరించి వచ్చిన ముఖ్యమంత్రితో పాటు సమావేశంలో వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ముఖ్యసలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు. మంత్రులైనా, పోలీస్ అధికారులైనా చేతులు సబ్బుతో కడుక్కున్న అనంతరం శానిటైజర్తో రబ్ చేసుకున్న తర్వాతే లోపలికి రావాలనే నిబంధన ప్రగతి భవన్ లో అమలు చేస్తున్నారు. ఇక సమీక్షా సమావేశం, కేబినెట్ భేటీ ఏదైనా సామాజిక దూరం పాటిస్తున్నారు. అనంతరం జరిగే ప్రెస్మీట్స్ లోనూ జర్నలిస్టులందరూ సామాజిక దూరం పాటించేలా కుర్చీలు దూరంగా వేస్తుండడం తెలిసిందే. ఇక ఇంటి నుంచి బయటకు వచ్చే వారెవరైనా ముక్కు, నోటిని కప్పిఉంచేలా మాస్క్ ధరించాలని సర్కారు స్పష్టం చేసింది. మార్కెట్లో కొరత ఉంటే ఇంట్లోనే మాస్క్ తయారుచేసుకోవాలని, కనీసం కర్చీఫ్ (చేతి రుమాలు)నైనా వాడాలని సూచించింది.

Sunday, April 12, 2020

Super Star Mahesh Babu intresting tweet on quarantine time

సితారతో ఆడుకుంటున్న ప్రిన్స్ మహేశ్
వృత్తి, ప్రవృత్తి పరంగానూ టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ శైలి పూర్తి క్రమశిక్షణతో కూడుకున్నది. దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ నేపథ్యంలోనూ ఆయన అదే ఒరవడిని కొనసాగిస్తున్నారు. ఏమాత్రం తీరిక దొరికినా కుటుంబసభ్యులతో ఉల్లాసంగా గడిపే తెలుగు సూపర్ స్టార్ ప్రస్తుతం అదే అనుసరిస్తున్నారు. భార్యాపిల్లలతో  ఎంచక్కా ఇంట్లోనే ఉంటూ సరదాగా గడుపుతున్నారు. క్వారంటైన్ టైమ్ని తన కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్నట్లు ఆయన ఫొటోతో ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. తన గారాలపట్టీ సితారతో మహేశ్ ఆడుకుంటున్న ఫొటో ప్రస్తుతం వైరల్ గా మారింది. 'అందరూ ఇంట్లోనే ఉండండి.. సేఫ్గా ఉండండి' అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇక ఫ్యాన్స్ ఫొటోతో పండుగ చేసుకుంటున్నారు. `ఇది చాలు' మాకు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలావుండగా 'సరిలేరు నీకెవ్వరు' బిగ్గెస్ట్ హిట్ తో ఖుషీగా ఉన్న మహేష్ 'గీతగోవిందం' ఫేమ్ పరశురామ్దర్శకత్వంలో మూవీని ఫైనల్ చేయనున్నారు. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.