Monday, March 2, 2020

YSRCP MLA Malladi Vishnu says about Srivari Temple in Kashmir on behalf of tourism meet

కశ్మీర్ లో శ్రీవారి ఆలయం!
కశ్మీర్లో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈ బృహత్ కార్యక్రమాన్ని చేపట్టనుంది. సోమవారం విజయవాడలో జరిగిన కశ్మీర్‌ టూరిజం, కల్చర్‌ మీడియా సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈ విషయాన్ని వెల్లడించారు. ఏపీ పెట్టుబడులకు అనువైన ప్రాంతమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యాటక రంగానికి పెద్ద పీట వేస్తున్నారన్నారు. సింగిల్‌ విండో విధానం ద్వారా టూరిజానికి అవసరమైన అనుమతుల్నిచాలా సులభతరం చేశారని విష్ణు వివరించారు. కశ్మీర్‌తో రాష్ట్ర పర్యటక రంగం అనుసంధానం కావడం శుభపరిణామంగా ఆయన పేర్కొన్నారు. భూతల స్వర్గమైన కశ్మీర్, ఏపీ టూరిజం పరస్పర అభివృద్ధికి సంపూర్ణ సహకారాన్ని తమ ప్రభుత్వం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

Saturday, February 29, 2020

Andhra Pradesh Govt. increases Petrol and Diesel prices and VAT affect from 1st March

ఏపీలో వాహనదారులకు ప్రభుత్వం షాక్
ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం నుంచి పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగనున్నాయి. వాహనదారులకు వై.ఎస్.ఆర్.సి.పి. ప్రభుత్వం ఈ మేరకు షాక్ ఇచ్చింది. వ్యాట్ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పెట్రోలు, డీజిల్ ధరలు భగ్గుమననున్నాయి.  వాణిజ్యపన్నుల శాఖ వ్యాట్ పెంపు ఉత్తర్వులు జారీ చేసింది. పెట్రోల్ మీద వ్యాట్ 31 శాతం వడ్డనతో లీటర్‌కు రూ.2.76 వరకు ధర పెరగనుంది. డీజిల్ మీద వ్యాట్ 22.25 శాతం  కలుపుకుని లీటర్ ధర రూ.3.07కు పెరుగుతుంది. ప్రస్తుతం ఏపీలో లీటర్ పెట్రోల్ ధర రూ.76.07 ఉండగా డీజిల్ రూ.70.67 ధరగా ఉంది. కాగా దేశంలోని మెట్రో పాలిటన్ నగరాల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఢిల్లీలో 71.94/64.65, కోల్ కతా 74.58/66.97, ముంబయి 77.60/67.75, చెన్నైలో 74.73/68.27 ధరలు అమలులో ఉన్నాయి.

Wednesday, February 26, 2020

Botsa Satyanarayana slams Chandrababu Over Trump Dinner issue

జగన్ దేశంలోనే గొప్ప సీఎం:బొత్స
దేశంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డే గొప్ప ప్రజానాయకుడని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. బహుశా అందుకే మంగళవారం ఢిల్లీలో ట్రంప్ విందు సమావేశానికి ఆయనను కేంద్రప్రభుత్వం ఆహ్వానించకపోయి ఉండొచ్చన్నారు. విశాఖలో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దంపతుల గౌరవార్థం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇచ్చిన విందుకు తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ ఖట్టర్, కర్ణాటక సీఎం యడ్యూరప్ప, అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ హాజరైన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ప్రతిపక్ష తెలుగుదేశం నాయకులు చేసిన విమర్శల్ని బొత్స తిప్పికొట్టారు. తొలిసారి ముఖ్యమంత్రి అయినందునే జగన్ ను పిలవలేదనడం కూడా సరైనది కాదన్నారు. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ల్ని ఆహ్వానించని విషయాన్ని గమనించాలని కోరారు. జగన్‌పై కేసులున్నందుకే ఆహ్వానం అందలేదని టీడీపీ నేతలు వ్యంగ్యోక్తులు విసరడంపై బొత్స తనదైన శైలిలో దుమ్మెత్తిపోశారు. సమావేశంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు పైనా ఆయన విరుచుకుపడ్డారు. 

Tuesday, February 25, 2020

China bans trade consumption of wild animals due to coronavirus

వన్యప్రాణి మాంసంపై చైనా నిషేధాస్త్రం
కొవిడ్‌-19 (కరోనా వైరస్‌) తీవ్రత దృష్ట్యా దేశంలో వన్యప్రాణి మాంస విక్రయాలు, వినియోగంపై  చైనా నిషేధాస్త్రం ప్రయోగించింది. మేరకు మ్యూనిస్టు చైనా పాలకులు సోమవారం కీలక నిర్ణయం ప్రటించారు. ప్రజల ఆరోగ్యం, ప్రాణాలు కాపాడ్డమే క్ష ర్తవ్యని పేర్కొన్నారు. దేశ అత్యున్నత నిర్ణాయక మండలి నేషనల్పీపుల్స్కాంగ్రెస్‌ (ఎన్పీసీ) మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు చైనా అధికారిక టీవీ చానల్పేర్కొంది. అధిక మోతాదులో వన్యప్రాణి మాంసభక్షణ సమస్యలకు దారితీస్తోందని చైనా ర్కార్ భావిస్తోంది. మరోవైపు కొవిడ్‌-19 కారణంగా చైనాలో మృతుల సంఖ్య 2,590 దాటింది. వైరస్నిర్ధారిత కేసుల సంఖ్య 77 వేల పైమాటేనని తెలుస్తోందిఇదిలావుండ‌గా వైరస్‌ కేంద్ర స్థానం హుబెయ్ ప్రావిన్స్ రాజధాని వూహాన్‌లో జన సంచారంపై ఆంక్షల్ని పరిమితంగా సడలించిన‌ట్లు స‌మాచారం. మ‌రోవైపు కొవిడ్‌-19 బాధితులు 80 వేలకు చేరుకున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) తాజాగా ప్రకటించింది. ప్రాణాంత రోనా ముప్పును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని డబ్ల్యూహెచ్వో చీఫ్టెడ్రోస్అధానమ్ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. వైరస్ ను అంచనా వేసేందుకు డబ్ల్యూహెచ్వో బృందాన్ని పంపగా వారిని హుబెయ్ ప్రావిన్స్, వూహాన్ ప్రాంతాల్లోకి వెళ్లనివ్వబోమని చైనా స్పష్టం చేసింది. తాజాగా  చైనా అనుమతి భించడంతో మందులు, వైద్య పరికరాలతో కూడిన భారత విమానం బుధవారం దేశానికి బయల్దేరనుంది.