Thursday, July 4, 2019

Loksabha passes aadhaar bill:it use is vital but voluntary,sats govt.


లోక్ సభలో ఆధార్ సవరణల బిల్లు ఆమోదం
భారత పార్లమెంట్ దిగువ సభ గురువారం సవరణలతో కూడిన ఆధార్ బిల్లు-2019ను ఆమోదించింది. కేంద్ర న్యాయ, సాంకేతిక సమాచార శాఖల మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రవేశ పెట్టిన ఈ బిల్లుకు సభ ఆమోదం తెల్పింది. ఆధార్ కార్డు చాలా కీలకమని అయితే వ్యక్తులు స్వచ్ఛందంగా వినియోగించే వీలు కల్పిస్తూ ఈ బిల్లును తాజాగా ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టింది. ఆధార్ కార్డు ద్వారా ప్రభుత్వం, ప్రజల్లో పారదర్శకత చాలా పెరిగిందని మంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అక్రమాలకు ఈ కార్డు చరమగీతం పాడిందన్నారు. 4.23 కోట్ల నకిలీ గ్యాస్ కనెక్షన్లు, 2.98 కోట్ల అక్రమ రేషన్ కార్డులు తొలగించడం సాధ్యమైందన్నారు. ఆయా లబ్ధికారక పథకాల్లో కోట్ల రూపాయల ప్రజాధనం అక్రమాల పాలవ్వకుండా ఆధార్ ద్వారా అడ్డుకట్ట పడిందన్నారు. తద్వారా ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదా అయినట్లు రవిశంకర్ తెలిపారు. ప్రస్తుతం వ్యక్తులు తమ ఇష్ట ప్రకారం బ్యాంక్ ఖాతాలు, ఫోన్ సిమ్ కార్డుల కోసం ఆధార్ ను వినియోగించుకోవచ్చు. వ్యక్తుల ఆధార్ వివరాల్ని ఏ సంస్థలు స్టోర్ చేయకూడదు. ఆ విధంగా ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.కోటి జరిమానా విధిస్తారు. ఆధార్ బయోమోట్రిక్ దుర్వినియోగం అయ్యే అవకాశమే లేదని మంత్రి చెప్పారు. కంటి పాప(ఐరిస్), వేలిముద్రలు(ఫింగర్ ప్రింట్స్), ఇతర వ్యక్తిగత వివరాలు(పర్సనల్ డేటా) భారత ప్రభుత్వ ఆధీనంలోని యంత్రాంగంలోనే అత్యంత భద్రంగా సురక్షితంగా స్టోర్ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం దేశంలో 123 కోట్ల మంది ఆధార్ కార్డును కల్గి ఉన్నారని వారు ఆయా అవసరాల నిమిత్తం ఆధార్ ను వినియోగించుకుంటున్నారని రవి శంకర్ వివరించారు.

No comments:

Post a Comment