Thursday, May 2, 2019

pm modi reviews preparedness on cyclone fani issues directions


ఫొని తుపాన్ పై ప్రధాని మోదీ సమీక్షా సమావేశం
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం (మే2) ఫొని తుపాన్పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉన్నతాధికారులతో భేటీ అయిన ఆయన తుపాన్ కు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు. తుపాన్ కదికలికలను అడిగి తెలుసుకున్న ప్రధాని ఎటువంటి విపత్కర పరిస్థితనైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని కోరారు. జాతీయ విపత్తు నివారణ బృందాలు, సైనిక బలగాల మోహరింపు తదితరాల సమాచారాన్ని తెలుసుకున్నారు. ప్రజలకు తాగునీరు, ఇతర నిత్యావసర వస్తువులు, టెలికాం సర్వీసులపై అధికారుల్ని అప్రమత్తం చేశారు. ఈ సమావేశానికి కేబినేట్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ, హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి, ఐ.ఎం.డి, ఎన్డీఆర్ఎఫ్, ఎన్డీఎంఏ, పీఎంఓ ఉన్నతాధికారులు హాజరయ్యారు. కాగా ఫొని తుపాన్ శుక్రవారం ఒడిస్సా తీరాన్ని తాకవచ్చని తెలుస్తోంది. దాంతో సుమారు ఎనిమిది లక్షల మంది లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

No comments:

Post a Comment